ప్రశాంతంగా ఎపి ఇసెట్‌

  • 97.27 శాతం హాజరు

ప్రజాశక్తి- అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి, అనంతపురం జెఎన్‌టియు సంయుక్తంగా నిర్వహించిన ఎపి ఇసెట్‌-2025 పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నుంచి 35,187 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 34,228 (97.27 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. మన రాష్ట్ర నుంచి 33,861 మంది దరఖాస్తు చేసుకోగా, 32,956 (97.33) శాతం) మంది పరీక్ష రాశారు. తెలంగాణలో 1326 మందికిగాను 1272 (95.93 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. అనంతపురం సమీపంలోని ఎస్‌ఆర్‌ఐటి ఇంజనీరింగ్‌ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఎపి ఇసెట్‌ చైర్మన్‌, జెఎన్‌టియు వైస్‌ ఛాన్సలర్‌ హెచ్‌.సుదర్శనరావు, కన్వీనర్‌ బి.దుర్గాప్రసాద్‌ తదితరులు తనిఖీ చేశారు. ఎపి ఇసెట్‌ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని సెట్‌ చైర్మన్‌ తెలిపారు.

➡️