ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖపట్నం, విజయవాడలో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టు ప్లాను కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. గతంలో రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ గడువు ముగియడంతో మరోసారి ప్లాను రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది. దీనికోసం ఇప్పటికే మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించి కన్సల్టెన్సీని నియమించింది. విశాఖ ప్లాను కోసం రూ.84.47 లక్షలు, విజయవాడ ప్లాను కోసం రూ.81.68 లక్షలు విడుదల చేసింది.
