August 15న గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్న సిఎం చంద్రబాబు

అమరావతి : ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున … అన్న క్యాంటీన్లను ప్రారంభించడానికి ఎపి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన తొలి విడతగా 100 అన్న క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అదే రోజున కఅష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. గుడివాడలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను సిఎం ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ కార్యక్రమం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగరపాలక సంస్థల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ అన్న క్యాంటీన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

➡️