మేడ్చల్ : మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్తో సహా ఏడుగురిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో కాలేజీ బృందం ఈరోజు మహిళా కమిషన్ ఎదుట హాజరైంది. విచారణకు హాజరైన అనంతరం కాలేజీ ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ… మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎదుట విచారణకు హాజరయ్యామని, సీక్రెట్ కెమెరాల ఘటనకు సంబంధించి వివరాలు అడిగారని తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతామని తెలిపారు.
