ప్రజాశక్తి-నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో మంగళవారం రాత్రి ఆత్మహత్యయత్నానికి పాల్పడబోయిన వ్యక్తిని కానిస్టేబుల్ కాపాడారు. పేరుపాలెం నార్త్ కు చెందిన కుడిపూడి చంద్రయ్య (45) సముద్రంలోకి దూకి పాల్పడుతున్నారని 112 కాల్ వచ్చింది. అదే సమయంలో బీచ్ అవుట్ పోస్ట్ లో డ్యూటీ చేస్తున్న నరసాపురం టౌన్ కానిస్టేబుల్ పీసీ 2485 పి.సత్యనారాయణ అప్రమత్తం అయ్యి చంద్రయ్యను కాపాడి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సత్యనారాయణను నరసాపురం డీఎస్పీ జి.శ్రీవేద, నరసాపురం టౌన్ బి.యాదగిరి, ఎస్సైలు జి.వాసు, సీహెచ్. జయలక్ష్మి, వై.నాగలక్ష్మి, ఎస్.ముత్యాలరావు అభినందించారు.
