విశాఖపట్నం : విశాఖ పోర్టులోని కంటెయినర్లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని నగర సిపి రవిశంకర్ అన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి రవిశంకర్ మాట్లాడుతూ … విశాఖ పోర్టులోని కంటెయినర్లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని, సిబిఐ డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చామని అన్నారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. నగరంలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కంటెయినర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్పారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే వెళ్లినట్లు వివరించారు. సిబిఐ విధి నిర్వహణకు తమవల్ల ఆటంకం కలగలేదని సిపి స్పష్టం చేశారు.
