కారులో ప్రేమజంట ఆత్మహత్య – సజీవదహనం..!

తెలంగాణ : వేర్వేరు కులాలకు చెందిన తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని ఆందోళన.. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానంటూ ఓ పోకిరీ బ్లాక్‌మెయిలింగ్‌.. వివాహానికి అడ్డొస్తున్న బాలిక వయసు.. దీంతో మానసికంగా ఒత్తిడికి గురైన ప్రేమ జంట కారులో సజీవదహనమయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం … యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు కుటుంబం 20 ఏళ్ల క్రితం అదే జిల్లా బీబీనగర్‌ మండలం జమిలాపేట్‌కు వచ్చి నివాసముంటోంది. ఆంజనేయులు కుమారుడు శ్రీరాములు (25) ఘట్‌కేసర్‌ మండలం నారపల్లిలో హౌల్‌ సేల్‌ సైకిల్‌ విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (17), శ్రీరాములు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు. వీరి ప్రేమ వ్యవహారం గురించి బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు మందలించి ఆమెపై చేయిచేసుకున్నారు. ఇలా గొడవలు జరుగుతున్నా.. ప్రేమజంట అప్పుడప్పుడూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో బాలిక సమీప బంధువు చింటూ.. వీరి ప్రేమ గురించి తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. తనకు డబ్బులివ్వాలని.. లేకపోతే తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించేవాడు. భయపడ్డ శ్రీరాములు పలుదఫాలుగా రూ.1.35 లక్షలు ఇచ్చాడు. మరింత డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి పెరిగిపోవడం.. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శ్రీరాములు సోమవారం మేడిపల్లిలోని ఓ సెల్ఫ్‌డ్రైవ్‌ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు. వారు అనుకున్న ప్రకారం.. బాలిక ఓ ప్రదేశానికి రాగా అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కారులో ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఘన్‌పూర్‌లోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కన కారు ఆపారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకొచ్చి గట్టిగా హాహాకారాలు చేస్తూ ఫుట్‌పాత్‌ మీద పడి మఅతి చెందాడు. బాలిక కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం ఏ మాత్రం గుర్తించలేనంతగా కాలిపోయింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. అటుగా వెళుతున్న వాహనదారులు కొందరు గుర్తించి పోలీసులు, అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోపు కారు, అందులోని బాలిక మఅతదేహం పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సెల్ఫ్‌డ్రైవ్‌ సంస్థ ప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని.. శ్రీరాములు కారు అద్దెకు తీసుకున్న వివరాలు పోలీసులకు చెప్పారు. అందులో ఉన్న సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంగా మఅతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొన్నిరోజుల క్రితం తమ అబ్బాయి ప్రేమ విషయం తమతో చెప్పాడని, ఘటనకు కొన్ని నిమిషాల ముందు ఆత్మహత్య లేఖను తమకు పంపాడంటూ ఓ లేఖను శ్రీరాములు తల్లిదండ్రులు చూపించారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు కారులోని నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు.. ఇద్దరి మఅతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు బ్లాక్‌మెయిలర్‌ చింటూ నివాసంపై దాడికి దిగారు. ఆ సమయంలో చింటూ లేకపోవడంతో అతని తండ్రిని కొట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

➡️