రాష్ట్రంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం : సిపిఎం

విజయవాడ : కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పోటీలు పడి మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రవేశ పెట్టిన నివేదికను రాష్ట్ర కమిటీి ఆమోదించింది.
తిరుపతి లడ్డుల తయారీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ నియమించడాన్ని ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర కమిటీ నివేదిక తెలిపింది. తిరుపతి తిరుమల దేవస్థానంలో అనేక సంవత్సరాలుగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలన్నిటినీ వెలికితీసి వాటిని నిరోధించేందుకు సూచనలు చేయాలని కోరుతున్నామని చెప్పింది. సిట్‌ నివేదిక వచ్చేంతవరకు అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలన్నారు. తదనంతరం తీసుకునే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాం. కానీ ఈ సమస్యను ఆసరా చేసుకుని ఇప్పటికేకొన్ని శక్తులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే దీనికి మతం రంగు పులిమి సామాజిక వాతావరణాన్ని అపవిత్రం చేస్తున్నాయని సిపిఎం ఆరోపించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న వైఖరి ఇలాంటి శక్తులకు ఊతమిచ్చేదిగా ఉందని విమర్శించింది. ఇతర మతాలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఏర్పడటానికి, మతసామరస్యం దెబ్బ తినడానికి కారణమౌతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉన్నత స్థానంలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ వైఖరి ప్రజల మధ్య ఐక్యత, సామరస్యం కాపాడే విధంగా ఉండాలి కానీ… దానికి భిన్నంగా ఆయన చేసే వ్యాఖ్యలు నష్టం చేసే విధంగా వున్నాయని కమిటీ తెలిపింది. లౌకిక పార్టీగా ఉన్న తెలుగుదేశం వైఖరి ఆత్మహత్యాసదఅశ్యం అని పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న పార్టీలు పోటీలు పడి మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడటానికి బదులుగా మోడీకి విన్నపాలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనని, ఈ పార్టీల వైఖరి రాష్ట్రంలో మతోన్మాదులు బలపడడానికి తోడ్పడుతుందని రాష్ట్ర కమిటీ చెప్పింది.
కేంద్రంలో మోడీ వంద రోజుల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సిపిఎం తెలిపింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై భరోసా లేదని, రాజధానికి నేరుగా నిధులివ్వకుండా అప్పు చేయించడం ప్రజలపై అదనపు భారం వేయడమేనని చెప్పింది. వెనుకబడిన ప్రాంతాలకు పైసా విదల్చలేదనీ… పైగా ధరలు విపరీతంగా పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ప్రజలకు సంబంధించినంత వరకు 100 రోజుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని తెలిపింది. గత ప్రభుత్వం బాటలోనే పరిపాలన యధావిధిగా సాగుతున్నదని కమిటీ తెలిపింది. అవినీతి ఆగలేదనీ, ట్రాన్స్‌ఫర్లు, పోస్టులకు భారీ ముడుపులు చేతులు మారుతున్నాయని, ఇసుక, మద్యం దందా కొనసాగుతున్నాయని, పోలీసు వైఖరిలోనూ మార్పు లేదని వివరించింది. తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా ఇప్పటికైనా వాటిని నెరవేర్చి ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివఅద్ధికి తగిన విధంగా సానుకూలమైన మార్పులు చేసి చూపెట్టాలని కమిటీ కోరింది. రాష్ట్రంలో లౌకిక విధానాలు పటిష్టం చేయడానికి, ఫెడరల్‌ హక్కులు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

కౌలు రైతులకే పరిహారం
వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి, ప్రత్యేకించి కౌలు రైతులకే పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరింది.

యువజన, విద్యార్ధి వలంటీర్లకు అభినందనలు
విజయవాడ, గుంటూరు, బాపట్ల, కఅష్ణా జిల్లా వరదల్లో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి నిలువులోతు నీళ్లలో సైతం దిగి వందలాది మంది వలంటీర్లు సహకారం అందించారు. పార్టీ భోజన శాలలు ఏర్పాటు చేసింది. సేవా కార్యక్రమాల్లో పాల్గన్న కార్యకర్తలు, వలంటీర్లందరినీ సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందించింది.

ఇసుకపై అక్టోబర్‌ 4న అందోళన
ఉచిత ఇసుక వాగ్ధానాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 4న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.

➡️