ప్రజాశక్తి-అమరావతి : దేశ రక్షణలో ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళి నాయక్కు సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు.
