ప్రజాశక్తి-అమరావతి: రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయంలో 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లు, 3, 4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. హెచ్వోడీ కార్యాలయానికి రూ. 1,126 కోట్లతో ఒక టవర్ నిర్మాణం కోసం మరో టెండరును పిలిచింది. మొత్తం 5 టవర్లకు రూ. 4,668 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
