నేడు హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు

Sep 10,2024 09:15 #judgement, #telangana highcourt

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగనుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పిటిషనర్‌ పేర్కొన్నారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌ పై జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ తో కూడిన బెంచ్‌ ఇవాళ విచారణ జరుపుతుందని హైకోర్టు తెలిపింది. అయితే అనేక రసాయనాలు కలిసిన రంగులతో తయారు చేయబడిన వేల కొద్ది గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ లో నిమర్జనం చేయడం వల్ల అధికంగా కలుషితం అవుతుందని.. ఈ నేపథ్యంలో హుస్సేన్‌ సాగర్‌ లో వినాయక నిమర్జనాలు చేయరాదంటూ గత ఏడాది హైకోర్టు తీర్పును వెలువరించింది. మరి ఈ ఏడాది వినాయక నిమర్జనాలు హుస్సేన్‌ సాగర్‌ లో ఉంటాయో..? లేదో..? అన్నది ఇవాళ కోర్టులో తేలనుంది.

➡️