ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతోపాటు జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తన వెబ్సైట్లో పేర్కొంది.
