ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలిస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది పరీక్ష జూన్ 1వ తేదిన జరుగనుంది. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుం దని పోలీస్ నియామక బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం బోర్డు వెబ్సైట్ రశ్రీజూతీb.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను రెగ్యులర్గా సందర్శించాలని పేర్కొన్నారు. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1వ తేది వరకు నిర్వహించిన ఫిజికల్ టెస్ట్లో 95,208 మంది అర్హత సాధించగా, ఈవెంట్స్లో 38,910 మంది అర్హత సాధించారని తెలిపారు.
