తిరుమల ఆలయం మీదుగా ఐదు విమానాలు – పోలీసులు అప్రమత్తం

తిరుమల : తిరుమలలో మళ్లీ కలకలం రేగింది. శుక్రవారం ఉదయం నుంచి వేంకటేశ్వరుడి ఆలయం మీదుగా ఐదు విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిత్యం తిరుమల కొండ పై ఆలయానికి సమీపంగా తరుచూ విమానాలు వెళుతుండటం పట్ల యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్‌ గా ప్రకటించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తిని విమానయాన శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శులొస్తున్నాయి. తిరుమల ఆలయంపై డ్రోన్లు ఎగరడం, వాటిని టీటీడీ విజిలెన్‌ స్వాధీనం చేసుకోవడం.. కొన్నిసార్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు ఉదయం నుంచి ఏకంగా ఐదు విమానాలు వేంకటేశ్వరుడి ఆలయం పరిసర ప్రాంతాల మీదుగా వెళ్లడంపై యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో …. పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల సీవీఎస్‌వో కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

➡️