తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ : తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోది. మూడో రోజు బండ వేషంలో యాత్రికులు భారీగా తరలివచ్చారు. బొగ్గుతో నామాలు, బొట్టు పెట్టుకొని, వేప మండలతో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నగర కమిషనర్‌ ఎన్‌.మౌర్య మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో జాతరను తిలకించేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగమ్మ ఆలయాన్ని పరిశీలించారు. క్యూలైన్ల నిర్వహణపై ఇఒ జయకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

➡️