ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్గా గోనుగుంట్ల కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని గ్రంథాలయ పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని కోటేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు.
