ప్రసూతి సెలవుల్లో ‘ఇద్దరు పిల్లల’ నిబంధన తొలగింపు

ఆర్థికశాఖ ఉత్తర్వులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలలోపు మాత్రమే 180 రోజుల సెలవులను ఇస్తుండగా, తాజాగా ఆ ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010లో 120 రోజులుగా ఉన్న ఈ సెలవులను 180 రోజులకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తల్లిదండ్రులపై ఆధారపడే ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ ఉత్తర్వులను సవరిస్తూ కనీస పిల్లలు అన్నది తొలగించాలని నిర్ణయించారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో జనాభా వృద్ధి ఆశించిన స్థాయిలో లేదని రాష్ట్ర ముఖ్యమంత్రే నేరుగా చెబుతున్న సంగతి తెలిసిందే. అరదుకే తాజాగా జనాభా పెంచాలన్న విధానాన్ని తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలకు ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రంగాల నిపుణులు, ప్రముఖుల నుంచి సూచనలు సలహాలు సేకరిస్తోంది. ఈ సూచనలకు అనుగుణంగానే తాజాగా విద్యార్థులకు ఇచ్చే సాయాన్ని కూడా కుటుంబంలో ఒక్కరికే కాకుండా ఎంతమంది పిల్లలు ఉరటే అరతమందికీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జనాభాను పెంచేందుకు మరిన్ని ప్రోత్సాహకాలపైనా కసరత్తు చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇరదులో భాగంగానే తాజాగా పిల్లలను సంరక్షిరచుకునేందుకు ఇస్తున్న ప్రసూతి సెలవుల్లోనూ ఇద్దరు పిల్లలకు మాత్రమే అన్న నిబంధన తొలగించడం గమనార్హం.

➡️