ఉగ్ర దాడి పట్ల గవర్నర్‌ విచారం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  జమ్మూకాశ్మీర్‌ పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడుల పట్ల గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్ర దాడిలో మరణించిన రాష్ట్రానికి చెందిన జెఎస్‌ చంద్రమౌళి, ముధుసూదన్‌ కుటుంబ సభ్యులకు గవర్నర్‌ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పర్యాటకులపై జరిగిన దాడిని గవర్నర్‌ ఖండించారు. సమాజంలో ఇటువంటి దుశ్చర్యలకు స్థానం లేదని, నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలన్నారు.

పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండించిన ఐలు

పహల్గామ్‌ ఉగ్రదాడిని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రాంత ప్రజలకు, పర్యాటకులకు భద్రత, రక్షణకు కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

➡️