ప్రజాశక్తి-పర్చూరు : బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ పలకల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరు నుండి పర్చూరు మీదుగా గుంటూరు వైపు గ్రానైట్ పలకల లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రానైట్ పలకలపై కూర్చున్న ముగ్గురు కూలీలు, గ్రానైట్ పలకల కిందపడి మతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గ్రానైట్ పలకలను తప్పించి మతదేహాలను వెలికి తీసినట్లు బాపట్ల డియస్పి రామాంజనేయులు తెలిపారు. మృతులు పాలపర్తి శ్రీను (25), తాళ్ళూరి ప్రభుదాస్ (37), తమ్ములూరి సురేంద్ర లుగా (26) గా గుర్తించారు. మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే ఏలూరి దిగ్బ్రాంతి
మండల పరిధిలోని తిమ్మరాజుపాలెం సమీపంలో లారీ బోల్తా ఘటనలో ముగ్గురు మతి చెందారు. ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. నూతలపాడుకు చెందిన తమ్మలూరి సురేంద్రబాబు, మార్టూరు చెందిన పాలపర్తి శీను, తాళ్లూరి ప్రభుదాసుల మృతికి ఎమ్మెల్యే ఏలూరి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.