వెంకటాచలం (నెల్లూరు) : నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం భారీ బంగారం పట్టుబడింది. ఓ కారులో ఎలాంటి ఆధారపత్రాలు, బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోని ఓ దుకాణానికి బంగారాన్ని తరలిస్తుండగా … శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ కారును సోదా చేసి రూ.3.38 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కారును సీజ్ చేశారు.
