హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్ 26న తాను భారత్కు రావాల్సి ఉందని తెలిపారు. ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్రావు తెలిపారు.
