హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో ఐటీ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు. . తెలుగు రాష్ట్రాలతో సహా ఢిల్లీ ముంబై, బెంగుళూరు, చెన్నైలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
