ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వు

హైదరాబాద్‌ : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అయితే, అవినాష్‌ రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించాడంటూ దస్తగిరి తన పిటిషన్‌లో తెలిపాడు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ కోర్టుకు తెలిపాడు. కేసు నుంచి అవినాష్‌ను తప్పిస్తే రూ.20 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి వెల్లడించారు. అయితే, కోర్టు దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని సీబీఐని ప్రశ్నించగా, సీబీఐ తరఫు న్యాయవాది సమర్థిస్తున్నామని బదులిచ్చారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు దస్తగిరి పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.

➡️