తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ సుజయ్ పాల్

Jan 14,2025 20:41 #sanjay pal, #TS High Court

హైదరాబాద్‌ :  తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్ పాల్ బాధ్యతలు స్వీకరించారు. సుజయ్ పాల్ ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. తాజాగా ఆయనకు చీఫ్‌ జస్టిస్‌గా పదోన్నతి లభించింది. జస్టిస్‌ సుజరు పాల్‌ గతేడాదే బదిలీపై తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా వచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసులతో తెలంగాణ హైకోర్టు ప్రస్తుత సీజే అలోక్ అరాథే బదిలీ అయ్యారు. జస్టిస్ అలోక్ అరాథేను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. దాంతో తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ ను నియమించారు.

➡️