కాళీయమర్దనాలంకారంలో కోదండరాముడు

ప్రజాశక్తి – ఒంటిమిట్ట : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం స్వామివారిని కాళీయమర్దనగా అలంకరించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాల భజనలు, కోలాటాల నడుమ స్వామివారిని పురువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో సీత, రాముడు, లక్ష్మణ వారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, యాత్రికులు పాల్గొన్నారు.

➡️