ప్రజాశక్తి-తిరుమల: తుపాను ప్రభావంతో తిరుమలలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండో ఘాట్ రోడ్డులోకొండచరియలు విరిగిపడ్డాయి. 15/8 , 14/8 కిలోమీటర్ల వద్ద కొండచరియలు స్వల్పంగా జారిపడినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు జేసిబిలతో బండరాళ్లను తొలగిస్తున్నట్లు తెలిపారు.
