‘ఉక్కు’ రక్షణతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందాం

May 5,2025 23:32 #Visakha Steel Protest
visakha steel plant protest in vizag

 విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకోవడమంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడమేనని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నమ్మి సింహాద్రి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1544వ రోజుకు చేరాయి. దీక్షల్లో డిఎస్‌ఇయు, టిఎన్‌టియుసి యూనియన్ల కార్యకర్తలు, ఉక్కు ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వింటూ కార్మికులకు నష్టం చేకూర్చే చర్యలు చేపడుతోందన్నారు. త్యాగాలతో సాధించుకున్న కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కార్మికులు మరింత ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ప్రజలంతా వారికి మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు.

➡️