కరువు మండలాల్లోని విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం

ప్రజాశక్తి-అమరావతి : కరువు మండల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వ హామీని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం రికార్డుల్లో నమోదు చేసింది. కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠ శాలలు, జూనియర్‌ కాలేజీల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుకు ఉత్తర్వులివ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ వేసిన పిల్‌ పరిష్కారమైనట్లుగా ప్రకటించింది.

➡️