- ఆక్టోపస్ బలగాల మాక్డ్రిల్
ప్రజాశక్తి -తిరుమల : జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్ధానానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకున్న టిటిడి యంత్రాంగం భద్రతను పెంచింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల లగేజీతో పాటు ప్రతి బ్యాగ్ను సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టిటిడి సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో అధునాతన టెక్నాలజీతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆక్టోపస్ బలగాలు మాక్డ్రిల్ నిర్వహించాయన్నారు. మాక్ డ్రిల్లో పోలీసు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు పాల్గొన్నాయని తెలిపారు.