పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు) : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి అంబటి రాంబాబు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️