కాకినాడ : వైసిపి అధినేత వైఎస్.జగన్కు ఆ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కఅతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైఎస్ జగన్కి లేఖ రాశారు. ఆ లేఖలో.. ” వైసిపి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా నియమించడంపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నా కఅతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే ఆక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి ” అని పేర్కొన్నారు.
