ప్రజాశక్తి పిఠాపురం : టీడీపీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగానే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎస్ వి ఎస్ ఎన్ వర్మ సృష్టం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో కార్యకర్తలతో సోమవారం సమావేశామైన వర్మ మాట్లాడుతూ.. గత 23 సం లుగా అధినేత చంద్రబాబుతోనే తన ప్రయాణం కొనసాగించానని, అధికారంలో ఉన్న లేకపోయినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశానన్నారు. పార్టీకి, ప్రజలకు అండగా ముందుకు వెళుతున్ననన్నారు. తనకి ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించడమే చంద్రబాబు తనికి ఇచ్చిన గొప్ప పదవన్నారు. పిఠాపురం టీడీపీ క్యాడర్ మొత్తం కేంద్ర పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, భవిష్యత్ రథసారథి మంత్రి లోకేష్ కి అండగా వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీని బలపరుస్తూ పిఠాపురం టీడీపీ నడుస్తుందని, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. టీడీపీ అంటే అంతా ఒకే కుటుంబం అని ఇటువంటి పదవులు కేటాయించేటప్పుడు అధినేత ఎన్నో సవాళ్ళు, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని,ఆ పరిస్థితులను నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అర్ధం చేసుకోవాలన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గత ఎన్నికల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారి వారి కుటుంబాలతో కలిసి కూటమి విజయనికి కృషి చేశామన్నారు.
