ప్రజాశక్తి- సూళ్లూరుపేట : సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ లో సోమవారం జాతీయ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు.స్థానిక బ్రహ్మప్రకాష్ ఆడిటోరియంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.ఎన్.బి. సింఘానె డైరక్టర్ నేషనల్ పై సర్వీస్ కాలేజ్,(ఎన్ ఎఫ్ ఎస్ సి), నాగపూర్ ని ఆహ్వానించారు. ఏ. రాజరాజన్ డైరక్టర్ షార్ అద్యక్షతవహించగా,ఎం. శ్రీనివాసులు రెడ్డి కంట్రోలర్ షార్ డిప్యూటీ డైరక్టర్లు, మరియు షార్ సీనియర్ మేనేజ్మమెంట్ ప్రతినిధులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. వేడుకలను పురస్కరిస్తు నిర్వహించిన వివిధ పోటీలలో గెలిచిన వారికి బహుమతులను అందజేసారు.ఈ కార్యక్రమాన్ని పీ.వెంకటరెడ్డి సీఎం సెట్ ఆపరేషన్ సిస్టమ్స్ ఏంటిది (ఎస్ ఓ ఎస్ సి) ఆద్వర్యంలో నిర్వహించారు.
