వికారాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజ్ లో క్షుద్ర పూజల కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే..వికారాబాద్ జిల్లా బషీరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజ్లో రోజూలాగే వచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులు భయాంధోళనకు గురయ్యారు. కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఎప్పుడూ లేని విధంగా కాలేజీ ఆవరణలో పూజలు చేయడం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. ముగ్గులు వేసి అందులో పసుపు, కుంకుమ ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. కాలేజీలో ఎవరైనా రాత్రి వచ్చి ఇలా చేసి వుంటారని భావిస్తున్నారు. దీనిపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కాలేజీకి చేరుకున్నారు. కాలేజీ ఆవరణలో ముగ్గులు, కుంకుమ, పసుపును చూసి ఆశ్చర్యపోయారు. కాలేజీలో క్షుద్ర పూజలు చేయడం ఏంటని షాక్ తిన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పూజలు చేశారా? ఆకతాయిల పనా..? అని ఆరా తీస్తున్నారు. కాలేజీలోని విద్యార్థులకు ప్రశ్నిస్తున్నారు. కాలేజీలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
