ఉండి పేదల ఇళ్ళ కూల్చివేతను నిరసిస్తూ 6న బహిరంగ సభ

ప్రజాశక్తి-ఉండి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ళకూల్చివేతను ఆపాలని కోరుతూ మే 6వ తేదీన భీమవరం పాత బస్టాండ్‌లో సాయంత్రం 3గంటలకు సిపిఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్‌.వి గోపాలన్‌ విలేకలరుల సమావేశంలో తెలిపారు. ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా, వామపక్షాల నాయకులు, ప్రజా సంఘాల నయాకులు, దళిత సంఘాల నాయకులు, అన్ని రాజకీయపక్షాల నాయకులు హాజరై ఈ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సందర్బంగా జె.ఎన్‌.వి గోపాలన్‌ మాట్లాడుతూ జిల్లాలోను, ఉండి నియోజకవర్గంలో ఏళ్ళ తరబడి ప్రభుత్వ పోరంబోకు భూముల్లో నివాసం ఉంటున్నారో అటువంటి వారందరూ ఈ బహిరంగ సభకు తరలిరావాలన్నారు. 150 గజాల్లోపు ఎవరైతే పేదలు ఇళ్ళు కట్టుకుని నివసిస్తూన్నారో వారికి రిజిష్ట్రేషన్‌ చేసి ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడమే కాదు ఈ మద్యనే దానికి ఉత్తర్వులు కూడా ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయమని కోరుతున్నామని అన్నారు. ఉండి నియోజకవర్గంలో లేని కాలుష్యాన్ని పేదలపై రుద్ది ఇళ్ళ తొలగించారన్నారు. ఉండి ఎమ్మెల్యేని, అధికారులను కోరిది ఒక్కటే ఇళ్ళు కూల్చివేత తక్షణం ఆపాలని తెలిపారు. జిల్లాలోను, నియోజకవర్గంలోను కాలుష్యం ఎవరివల్ల, దేనివల్ల అవుతోందో వెలికితీద్దాం, నిర్ధారిద్దాం అన్నారు. కాలుష్యం ఉంటే దాని నివారణమార్గాలు ఏమిటని దాని ఏవిదంగా చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయాలన్నారు. ఒకవేల పేదల ఇళ్ళు అనివార్యంగా తీసేయాల్సి వస్తే వారికి ప్రత్యామ్నాం చూపకుండా ఇళ్ళు కూల్చివేయడం అన్యాయం, అనాలోచిత చర్య అన్నారు. ఉండి నియోజకవర్గంలో జరిగే దుర్మార్గం ఏదైతే ఉందో జిల్లాలో మరెక్కడా జరక్కుండా బాధితుల, ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
➡️