రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం నూతన మున్సిపల్ కమిషనర్ గా పి. కిషోర్ ను నియమించారు. ఈయన నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తూ బదిలీ పై వచ్చారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ మాలిక్ ను మున్సిపల్ వ్యవహారాల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు.
