జగన్‌ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు

Mar 13,2025 17:48 #jagan

తాడేపల్లి : తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే..  దాదాపు 400 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై  గ్రామ బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన కుటుంబాలు  మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందినవే కావడం గమనార్హం.

కాగా, గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైసీపీ సానుభూతిపరులన్న కారణంతో గ్రామం నుంచి బహిష్కరించారని.. గ్రామంలోకి వస్తే చంపేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు జగన్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారికి అండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని  జగన్‌ భరోసానిచ్చారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిశారు. వీరితో పాటు తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామాలకు చెందిన మరికొంత మంది కూడా జగన్‌ను కలిశారు.  పిన్నెల్లి  గ్రామ బహిష్కరణ  విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ న్యాయపరంగా హైకోర్టులో కూడా పోరాడుతుంది. వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి ఆపార్టీ సిద్దమవుతుందని సమాచారం.

➡️