ఇచ్చోడ (ఆదిలాబాద్) : పాఠశాలలోని విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ఓ పాఠశాలలో విషప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో, మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా దుండగులు పురుగుల మందు చల్లారు. అయితే సిబ్బంది గమనించడంతో 30 మంది విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై పాఠశాల హెచ్ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
