వడదెబ్బతో గర్భిణీ మృతి

ప్రజాశక్తి -కే వి బి పురం (తిరుపతి జిల్లా) : వడదెబ్బతో గర్భిణీ మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా కెవిబి పురం మండలంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగయ్యగుంట పంచాయతీ పరిధిలోని తిమ్మినాయుడు గుంట గిరిజన కాలనీకి చెందిన ఎ.చెల్లమ్మ (29) ఎనిమిదో నెల గర్భవతి. ఎండలకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈతాకు తేవడం, చుట్టుపక్కల పొలాల్లో పనులకు వెళ్లడం వల్ల వడదెబ్బతో చెల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

➡️