అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు!

గుంటూరు: దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనివర్శిటీ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. దేశంలోనే ప్రైవేటు యూనివర్శిటీల్లో నెంబర్‌ వన్‌గా ఉన్న ఎస్‌ఆర్‌ఎంతో కలిసి రిలయన్స్‌ ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. లాంఛనాలు అన్నీ పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎస్‌ఆర్‌ఎం ఇప్పటికే అమరావతిలో అతి పెద్ద క్యాంపస్‌ నిర్వహిస్తోంది. జగన్‌ పాలనలో విస్తరణ ప్రణాళికలు నెమ్మదిగా సాగాయి. ప్రభుత్వం మారడంతో ఈ పనులు పూర్తి స్థాయిలో ఊపందుకోనున్నాయి.
ఇటీవల ఎస్‌ఆర్‌ఎం చైర్మన్‌తో పాటు ఆ యూనివర్శిటీ బఅందం చంద్రబాబుతో సమావేశం అయింది. ఈ సందర్భంగా ఏఐ యూనివర్సిటీ ప్రస్తావన వచ్చింది. ఇలాంటి యూనివర్సిటీ నిర్వహణకు.. ఓ కార్పొరేట్‌ కంపెనీ అండ ఉంటే, మంచిదన్న అభిప్రాయానికి రావడంతో రిలయన్స్‌ తో చర్చించినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్‌లో ఏఐదే ప్రముఖ పాత్ర. మానవ వనరులను తర్వాతి తరం అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవడంలో ఏఐ విజ్ఞానానిది కీలక పాత్ర. వచ్చే ఇన్నోవేషన్లన్నీ ఏఐ కేంద్రంగానే ఉంటాయి. అందుకే ఈ యూనివర్సిటీ గేమ్‌ ఛేంజర్‌ గా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.

➡️