- పలువురు నివాళి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘ప్రజాశక్తి’ స్టేట్ బ్యూరోలో న్యూస్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్న తిప్పసముద్రం వెంకట రమణ భార్య శిల్ప (33) మరణించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. రమణ-శిల్ప దంపతులకు భవ్య, నవ్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శిల్ప మృతదేహాన్ని ఎయిమ్స్ నుంచి ముందుగా తాడేపల్లిలోని ప్రజాశక్తి కార్యాలయానికి, అక్కడి నుంచి విజయవాడలోని ఆమె ఇంటివద్దకు, అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి సందర్శనార్ధం తరలించారు. శిల్ప భౌతికకాయానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు పి మధు, ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, వి ఉమామహేశ్వరరావు, బి బలరాం, కె సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు కె ధనలక్ష్మి, ఎం సూర్యారావు, కె ఉమామహేశ్వరరావు, డి కాశీనాథ్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, ప్రజాశక్తి సిజిఎం వై అచ్యుతరావు, సంపాదకవర్గ సలహాదారు ఎంవిఎస్ శర్మ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ప్రసాద్, పోలారి, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. శిల్పా మృతి పట్ల, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, యుటిఎఫ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఐద్వా, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, ఎపిడబ్ల్యూజెఎఫ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపాలు ప్రకటించాయి.
ముగిసిన అంత్యక్రియలు
శిల్ప అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఆమె స్వగ్రామం ఆరెకోడులో ముగిశాయి. ఆమె భౌతికకాయాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. శిల్ప చితికి ఆమె చిన్న కుమార్తె నవ్య నిప్పంటించారు. ప్రజాశక్తి న్యూస్ ఎడిటర్ రాజగోపాల్ శర్మ, జనరల్ మేనేజర్ కె హరికిషోర్, నవ తెలంగాణ మఫిషియల్ ఇన్ఛార్జి వేణుమాధవ్, స్టేట్ బ్యూరో చీఫ్ బివిఎన్ పద్మరాజు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.