రాష్ట్రంలో రౌడీయిజం.. అభ్యర్థులు జాగ్రత్తగా ఉండండి : చంద్రబాబు

విజయవాడ : ఎన్నికల వేళ … అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు. శనివారం ఉదయం విజయవాడలో టిడిపి నేతలతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చంద్రబాబు ప్రసంగిస్తూ … నేడు రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనిపిస్తోందని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని… అదే అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చిందని తెలిపారు. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని అన్నారు. పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయామని…. సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.

➡️