ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి ఆర్పి ఠాగూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జిఓ ఆర్టి నెంబరు 232ను శనివారం విడుదల చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా ఎపి భవన్లో ఆయన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.
