ప్రజాశక్తి -తిరుమల : శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు విశాఖకు చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు రూ.కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని టిటిడి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్.నాయుడుకు విరాళం డిడిని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
