ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌ మృతి

Dec 9,2024 18:38 #AP-Telangana, #road acidnet
  • విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కన్న డ్రైవర్‌ మతదేహాన్ని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఆ ఆర్టీసీ బస్సు నల్గొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద ఘటనతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది.

➡️