ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు..

Dec 31,2024 17:33 #ap government, #IAS officers, #promoted

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సురేష్‌ కుమార్‌, సాల్మన్‌ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్‌ కుమార్‌ను రీడిజిగెట్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై సాల్మన్‌ ఆరోక్య రాజ్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులకు కూడా పదోన్నతులు పొందారు. కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్‌, సీహెచ్‌ శ్రీధర్‌లకు కార్యదర్శి హౌదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎంఓలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు.. అక్కడే సీఎం కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. మరోవైపు.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా వీరపాండ్యన్‌ కొనసాగనున్నారు. కడప జిల్లా కలెక్టర్‌గానే శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు.. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు విక్రాంత్‌ పాటిల్‌, సిద్ధార్థ్‌ కౌశల్‌లకు పదోన్నతులు కల్పించారు.

➡️