- డిజిపి ప్రకటన
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉన్న కాశ్మీరీ విద్యార్థులు, వ్యక్తుల సహాయం కోసం నోడల్ ఆఫీసరును నియమించినట్లు డిజిపి హరీష్కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నోడల్ ఆఫీసరుగా ఎఐజి అండ్ లా అండ్ ఆర్డర్ సిద్ధార్థ్ కౌశల్ను నియమించామని తెలిపారు. అవసరమైన వారు 0863 2340471 నెంబరును సంప్రదించాలని డిజిపి తెలిపారు.