ప్రజాశక్తి వైద్య శిబిరానికి విశేష స్పందన(ఫోటోలు)

ప్రజాశక్తి-విజయవాడ : ప్రజాశక్తి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా విజయవాడలోని వాసవి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులు జి సమరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ప్రజారోగ్య విభాగ అధికారిణి పి రత్నావళి చేతుల మీదగా ప్రజాశక్తి ప్రచురించిన వైద్య రంగ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. విజయవాడ ఎడిషన్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణ అధ్యక్ష వహించిన  ఈ సభలో ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాసు, ప్రముఖ వ్యాస్క్యులర్ సర్జన్ డాక్టర్ మాకినేని కిరణ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాశక్తి కన్వీనర్ ఎంబి నాథన్, తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో రక్తపోటు, మధుమేహంతో పాటు శరీర బరువు  సూచిక, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలు ఉచితంగా చేశారు. అనేక మంది ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లను సన్మానించారు.

 

 

➡️