భద్రతా వలయంలో షార్‌

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : భారత్‌,పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో షార్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భద్రత దృష్ట్యా అణువణువు పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో భాగంగా శనివారం మాక్‌ డ్రిల్‌ను గెట్‌ నెంబర్‌ 1బి వద్ద సుమారు 70 మంది సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్‌ఎఫ్‌కి చెందిన సంజరు కుమార్‌ డీఐజీ, సీనియర్‌ కమాండంట్‌ సంజిత్‌ కుమార్‌, డిప్యూటీ కమాండంట్‌ ఎం.కె.గౌర్‌, సూళ్లూరుపేట సిఐ.మురళీకృష్ణ, అధికారులు, శ్రీహరికోట ఎస్‌ఐ, మెరైన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️