ప్రజాశక్తి-రైల్వేకోడూరు : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్య,వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మదనమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుండి 26 వరకు మదనపల్లిలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి 300 మంది ప్రతి నిధులు హాజరు కానున్నారనీ, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధి అవకాశాల కోసం భవిష్యత్తులో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య కార్పొరేటి కరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ అనునిత్యం పోరాడుతుందన్నారు. ఈ శిక్షణ తరగతులు జయప్రదానికి మేధావులు, ఉపాద్యాయులు, విద్యావేత్తలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దీవన్, విజరు, ఆదర్శ్, ఉప్పేంద్ర, తదితరులు తదితరులు పాల్గొన్నారు.
